ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలి ఆస్తి నష్టం కూడా సంభవించింది. మొంథా తుఫాన్ నష్టం ఎంతమేరకు అనేది మరికొన్ని రోజుల్లో అధికారులు అంచనా వేయనున్నారు. అయితే మత్స్యకార కుటుంబాలపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి వాతావరణ శాఖ అధికారులు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడటం, ఆ తర్వాత తుఫాను మారిన సంగతి తెలిసిందే. దీంతో సుమారు ఐదారు రోజులుగా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు మత్స్యకార కుటుంబాలు. అలాగే అప్పటికే చేపలవేటకు వెళ్లినవారిని కూడా సముద్రంపై నుంచి వెనక్కి పిలిపించారు.
చేపలవేట ప్రధాన జీవనాధారంగా గడిపే మత్స్యకారులను తుఫాను దారుణంగా దెబ్బతీసింది. దీంతో వారి జీవనోపాధికి ఆటంకం కలిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మొంథా తుఫాన్ నేపథ్యంలో గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం ఉచితంగా అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో కందిపప్పు. కిలో బంగాళాదుంపలు, లీటర్ నూనె, కిలో చక్కెర ఉచితంగా అందించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల వారికి ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలు అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 25 కేజీల బియ్యంతో పాటుగా పైన చెప్పిన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
మరోవైపు తుఫాను కారణంగా పలుచోట్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు పంపించనున్నారు. ఇక పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. తుఫాను బాధితులకు ఒక్కొక్కరికీ వేయి రూపాయలు చొప్పున అందించనుంది. అలాగే ముగ్గురి కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు గరిష్టంగా మూడు వేలు సాయంగా అందించనుంది. పునరావాస కేంద్రాల నుంచి వారు ఇళ్లకు తిరిగివెళ్లేటప్పుడు ఈ ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa