ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా, చైనా ల మధ్య జరిగిన చర్చలు సఫలం

international |  Suryaa Desk  | Published : Thu, Oct 30, 2025, 04:59 PM

వాణిజ్య యుద్ధంతో అట్టుడుకుతున్న ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య గురువారం జరిగిన సమావేశం ఫలప్రదమైంది. ఈ భేటీ అమెరికా-చైనా సంబంధాలలో ఒక ‘అద్భుతమైన కొత్త ఆరంభం’ అని ట్రంప్ అభివర్ణించారు. చర్చల అనంతరం చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో పాటు పలు కీలక వాణిజ్య ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు.దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో ఇరు నేతలు దాదాపు రెండు గంటల పాటు రహస్యంగా చర్చలు జరిపారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ "ఇది ఒక అద్భుతమైన సమావేశం. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ముఖ్యమైన అంశాలపై కుదిరిన ఒప్పందాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం" అని తెలిపారు. చైనా ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 57 శాతం సుంకాన్ని 47 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది తమ సద్భావనకు నిదర్శనమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa