ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడిన దుండగులు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 30, 2025, 05:05 PM

ముంబైలోని ప్రఖ్యాత కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడిపై కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వైద్యుడు ప్రస్తుతం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా సిబ్బందితో బాధితుడైన డాక్టర్‌కు శారీరక సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలోనే పగ పెంచుకుని, తన సోదరితో సంబంధం పెట్టుకున్న డాక్టర్‌పై దాడికి పథకం రచించాడు.ఇందుకోసం మరో ఇద్దరు స్నేహితుల సహాయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి డాక్టర్‌పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వెంటనే ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన మహిళ సోదరుడు, అతని ఇద్దరు స్నేహితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa