అక్రమంగా నివసిస్తున్న వలసదారుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 2,790 మందికి పైగా భారతీయ పౌరులను బహిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అమెరికాలో నివసించేందుకు అవసరమైన అర్హతలు లేని వారిని గుర్తించి, ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపిస్తున్నట్లు వెల్లడించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వివరాలను వెల్లడించారు. "ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు, అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి జాతీయతను, గుర్తింపును మేం ధ్రువీకరించిన తర్వాతే వారిని అమెరికా నుంచి వెనక్కి పంపారు" అని ఆయన వివరించారు. భారత్-అమెరికా మధ్య ఉన్న చట్టపరమైన, దౌత్యపరమైన విధానాలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ జరిగిందని ఆయన స్పష్టం చేశారు.అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి కూడా భారతీయులను బహిష్కరించినట్లు జైస్వాల్ తెలిపారు. "ఈ ఏడాది యూకే నుంచి సుమారు 100 మంది భారతీయ పౌరులను బహిష్కరించారు. వారి జాతీయతను ధ్రువీకరించిన తర్వాతే యూకే ఈ చర్య తీసుకుంది" అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa