ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలుచేశారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 01:36 PM

ఒక సంతకం పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న  కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా నగరంలోని పాతురు మసీదులోమాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షులు మన్సూర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానం వల్ల  వైద్య విద్యలో మైనార్టీలకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు అందించిన  4 శాతం రిజర్వేషన్లు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చి 16 నెలలు అవుతున్నా ఎన్నికల సమయంలో  ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa