ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షంతో ఆలస్యంగా ప్రారంభం కానున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌

sports |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 04:57 PM

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం, మధ్యాహ్నం 3 గంటలకు టాస్ వేయనుండగా, 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.మధ్యాహ్నం సమయంలో చిరుజల్లులు ప్రారంభం కావడంతో మైదానం సిబ్బంది వెంటనే కవర్లు కప్పారు. దీంతో ఇరు జట్ల క్రీడాకారిణులు వార్మప్ చేయకుండా డగౌట్‌కే పరిమితమయ్యారు. అయితే, షెడ్యూల్ ప్రకారం టాస్‌కు అరగంట ముందు, అంటే 2 గంటల సమయంలో వర్షం ఆగిపోయి, కాసేపు ఎండ వచ్చింది. సిబ్బంది కవర్లు తొలగించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. సర్కిల్ అవతల కొన్ని చోట్ల నీటి గుంతలు ఉండటంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సిబ్బంది వాటిని సరిచేసే పనిలో నిమగ్నమవ్వగా, క్రీడాకారిణులు వార్మప్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa