ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హంసలదీవి వద్ద తగ్గిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 10:59 AM

కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పుణ్య స్నానాలకు భక్తుల రద్దీ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావించినప్పటికీ, అందుకు తగ్గట్టుగా రద్దీ నమోదు కాలేదు. బుధవారం ఉదయం పోలీస్ శాఖ సముద్ర తీరం వద్ద బందోబస్తును పటిష్టంగా నిర్వహించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరైన్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa