వైయస్ కుటుంబం పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆదినారాయణరెడ్డి, ఆ తర్వాత మంత్రి పదవి కోసం టీడీపీలోకి ఫిరాయించాడని... మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఆయన చంద్రబాబుకి దగ్గరవ్వాలన్న తాపత్రయంతో వైయస్ కుటుంబం, వైయస్ జగన్ సతీమణి భారతి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసును ప్రస్తావించి వైయస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా చంద్రబాబుకి దగ్గరై ఫ్లైయాష్ కాంట్రాక్టు దక్కించుకోవాలన్నదే ఆదినారాయణరెడ్డి ఎజెండా అని స్పష్టం చేశారు. కడపలో వైయస్ జగన్ని ఇంకోసారి రానివ్వమని చెబుతున్న ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగులో ఇప్పుడు సరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఆయన నేతృత్వంలో ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలవలేరని గట్టిగా బదులిచ్చారు. మంత్రి నారా లోకేశ్ను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా, 4 గంటల్లో 4 వేల అర్జీలు చూసి సమస్యలు పరిష్కరించారని చెప్పడం లాజిక్ కి కూడా అందకుండా ఉందని ఎద్దేవా చేశారు. లోకేశ్ ప్రేరణతోనే ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచారని ప్రచారం చేసే ఎల్లో మీడియా, అదే టీమ్లో సభ్యురాలిగా ఉన్న కడప బిడ్డ శ్రీచరణిని ప్రభుత్వం అభినందించి ప్రోత్సాహకం ప్రకటించకపోవడాన్ని సతీశ్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, హారిక వంటి క్రీడాకారులకు ఒక న్యాయం, శ్రీచరణికి ఇంకో న్యాయమా.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa