తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడుగా బీ ఆర్ నాయుడు ఏడాది పాలనలో భక్తులకు చిన్న మేలు కూడా జరగలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... అసమర్థుని జీవయాత్ర అమోఘంలా సాగిన బీ ఆర్ నాయుడు ఏడాది పాలనలో... కన్యాశుల్కంలో గిరీశాన్ని మించి కోతలు తప్ప భక్తులు ప్రయోజనాల కోసం చేసిన చేతలేవీ లేని తేల్చి చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ముందే టీటీడీని ప్రక్షాళన చేస్తానంటూ పెద్ద మాటలు మాట్లాడిన ఆయన... చివరకు చైర్మన్ కార్యాలయాన్ని బూతుల నిలయంగా మార్చారని ఆక్షేపించారు. అధికారులతో సమన్వయ లోపం, ఆయన అవగాహన లేమితో తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకున్నాయని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో 6 గురు భక్తులు మృతి చెందడంతో పాటు, తిరుమలలో యధేచ్చగా మద్యం అమ్మకాలు, మద్యం మత్తులో మహిళలపై ఆకతాయిల వేధింపులు, మహాద్వారం వద్ద చెప్పులతో భక్తుల సంచారం వంటవన్నీ ఆయన పాలనలో జరిగిన అపచారాలేనని కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa