ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తులని కట్టబెట్టాలని చూస్తే సహించమ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 01:38 PM

ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ స్టేట్ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరునకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టి.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు ఉన్న వాళ్లకేనా ఈ ప్రభుత్వం ఉండేది పేద వాళ్ళని పట్టించుకోదా అని, ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో అసహనం వచ్చిందని వైయస్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టిన అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa