ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు ఘటన.. వేమూరి ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 01:44 PM

AP: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి సజీవ  దహనమయ్యారు. సీటర్ వాహనాన్ని స్లీపర్‌గా మార్చినట్లు, బస్సు రిజిస్ట్రేషన్‌ విషయంలోనూ లొసుగులున్నట్లు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa