విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సమ్మిట్ నిర్మాణాత్మక వాతావరణంలో సాఫీగా సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఈ సదస్సు కీలకమని, దీని ద్వారా భారీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పెట్టుబడుల సాధనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని సీఎం ప్రశంసించారు. మంత్రి ఆదేశాలతోనే ఎమ్మెల్యేలు చైతన్యవంతులయ్యారని, ప్రజాదర్బార్లు నిర్వహిస్తూ స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు.
అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ గడువులోపే చేరేలా అన్ని చర్యలు చేపడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అధునాతన సాంకేతికత రాష్ట్ర డిజిటల్ పురోగతికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన వివరించారు.
మీడియాతో అనధికారిక చర్చలో సీఎం మాట్లాడుతూ, ‘ఎక్కడికక్కడే సమస్యలు తీర్చడమే మా ప్రధాన లక్ష్యం. లోకేశ్ నేతృత్వంలో ఎమ్మెల్యేల కదలిక ఈ దిశలో ఫలవంతంగా సాగుతోంది’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa