కర్నూలు జిల్లావాసులకు శుభవార్త. కర్నూలు- విశాఖ మధ్య నూతన ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. మంత్రి టీజీ భరత్.. కర్నూలు విశాఖపట్నం మధ్య మూడు నూతన ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభమించారు. ఏసీ బస్సులు అందుబాటులోకి రావటంతో పర్యాటకంగా ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మరోవైపు ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల పట్ల మంత్రి టీజీ భరత్ స్పందించారు. ఈ ఘటనలు చాలా బాధకరమని అభిప్రాయపడ్డారు.
సాగర తీరం విశాఖపట్నానికి సీజన్లతో సంబంధం లేకుండా పర్యాటకులు తరలి వస్తుంటారు. విశాఖపట్నం, ఆ చుట్టుపక్కల ఉండే చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించి అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు. అయితే విశాఖకు రావాలంటే రాయలసీమవాసులకు కాస్త దూరమనే చెప్పాలి. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు, విశాఖపట్నం జిల్లాకు మధ్యన దూరం ఎక్కువ. కర్నూలు జిల్లా నుంచి విశాఖపట్నానికి వెళ్లాలంటే ఎక్కువ మంది రైళ్లు, కాస్త ఖరీదైన పర్లేదనుకునేవాళ్లు విమానాలను ఆశ్రయిస్తూ ఉంటారు.
అయితే అలాంటివారికి కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. కర్నూలు నుంచి విశాఖపట్నానికి నూతన ఏసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ఏపీ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా కర్నూలు నుంచి విశాఖకు మూడు నూతన ఏసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి టీజీ భరత్.. బస్సు సర్వీసుల ప్రారంభం వలన పర్యాటకంగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో వరుసగా బస్సు ప్రమాదాలు జరగడం చాలా బాధకరమని టీజీ భరత్ అన్నారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన పలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మద్యం మత్తులో బైక్ డ్రైవింగ్ చేసిన యువకుడు ప్రమాదానికి గురికావడం.. ఆ బైక్ రోడ్డుపై అడ్డుగా పడిపోవటం.. రోడ్డుపై పడి ఉన్న ఆ బైక్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారనే దానిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే తెలంగాణలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ- ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. లారీలోని కంకర బస్సులోని ప్రయాణికుల మీద పడటంతో అందులో ఇర్కుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన 19 మందిలో 13 మంది తాండూరుకు చెందిన వారే కావటంతో.. ఆ ఊరు మొత్తం విషాదంలో మునిగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa