అతడో రేపిస్ట్. అంతకుమించి ఒక సీరియల్ కిల్లర్. ఆ నరరూప రాక్షసుడు.. 20 మందిని అత్యాచారం చేశాడు. 18 మందిని అతి దారుణంగా హత్య చేశాడు. దీంతో అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత.. దాన్ని రద్దు చేసి.. 30 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఈ క్రమంలోనే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ వ్యక్తి.. జైలులో మాత్రం వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. టీవీ, సెల్ఫోన్లలతోపాటు పలు సౌకర్యాలు అందుతున్నాయి. ఆ ఒక్క ఖైదీకి మాత్రమే కాకుండా ఇతర నేరగాళ్లకు కూడా ఆ జైలులో అలాంటి మర్యాదలే చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి రావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పరన అగ్రహార సెంట్రల్ జైలులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో భారీ భద్రతా లోపాలు, ఖైదీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సీరియల్ రేపిస్ట్, కిల్లర్ సహా పలువురు కరుడుగట్టిన ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ, టీవీ చూస్తూ ఉన్న వీడియోలు బయటపడ్డాయి. 1996 నుంచి 2002 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేసి.. 18 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ ఉమేష్ రెడ్డి.. సెల్లో రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్, టీవీ ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది.
ఉమేష్ రెడ్డి చేసిన నేరాలకు గానూ మొదట సుప్రీంకోర్టు మరణశిక్షను విధించింది. అయితే ఈ మరణశిక్షను 2022లో రద్దు చేసి.. 30 ఏళ్ల జైలు శిక్షను (రిమిషన్ లేకుండా) విధించింది. మరోవైపు.. ఐపీఎస్ అధికారి కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న తరుణ్ రాజు.. జైలు లోపల వంట చేసుకుంటూ, మొబైల్ ఫోన్ వాడుతున్న ఫోటోలు కూడా బయటికి రావడం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనలపై దర్యాప్తునకు ఆదేశిస్తామని.. అవసరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు.
జైలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇలా తీవ్రమైన నేరాలు చేసి.. కోర్టులు శిక్షలు విధించిన ఇలాంటి ఖైదీలు అనుభవిస్తున్న విలాసవంతమైన సౌకర్యాలు.. జైలు అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ భద్రతా వైఫల్యాలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa