ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. అయితే టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసిన సమయంలో వర్షం ఎంట్రీ ఇచ్చింది.
ఓపెనర్లు ఇద్దరూ ధాటిగా రన్స్ చేస్తున్నపుడే ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో వాతావరణం మారిపోయింది. దీంతో అంపైర్లు ముందు జాగ్రత్తగా మ్యాచ్ను ఆపేశారు. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లలోకి వెళ్లిపోయారు. ఇది జరిగిన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో ఈ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో భాగంగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. ఆ తర్వాత ఆసీస్ గెలవగా.. మూడు, నాలుగో టీ20 మ్యాచ్లలో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.
అభిషేక్ శర్మ అరుదైన రికార్డు..
ఈ సిరీస్లో 40కి పైగా సగటు 160కి పైగా స్ట్రైక్రేట్తో 163 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. అభిషేక్ శర్మ 28 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ సాధించాడు. తొలి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.
భారత్ తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ టీ20లలో వెయ్యి రన్స్ చేసిన ఆటగాళ్లు ఎవరంటే..
విరాట్ కోహ్లీ - 27 ఇన్నింగ్స్లు
అభిషేక్ శర్మ - 28 ఇన్నింగ్స్లు
కేఎల్ రాహుల్ - 29 ఇన్నింగ్స్లు
సూర్యకుమార్ యాదవ్ - 31 ఇన్నింగ్స్లు
రోహిత్ శర్మ - 40 ఇన్నింగ్స్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa