ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఓ భారత ఆటగాడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. మేఘాలయకు చెందిన 25 ఏళ్ల ఆకాశ్ కుమార్ చౌదరి కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి అద్భుతం చేశాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు., సూరత్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ భారీ స్కోరు దిశగా సాగుతోంది. జట్టు స్కోరు 576/6 వద్ద 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆకాశ్ కుమార్ చౌదరి ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. అరుణాచల్ బౌలర్ లిమార్ దాబీ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 6 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఓవర్ తొలి రెండు బంతుల్లోనూ సిక్స్ లు కొట్టాడు. వరుసగా 8 సిక్సర్ల సాయంతో కేవలం 11 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. చివరికి 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం మేఘాలయ 628/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బ్యాటింగ్లోనే కాకుండా, బంతితోనూ ఆకాశ్ రాణించి తొలి వికెట్ పడగొట్టడం విశేషం.ఈ ప్రదర్శనతో ఆకాశ్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2012లో లెస్టర్షైర్ తరఫున వేన్ వైట్ (12 బంతులు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును అధిగమించాడు. భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు బందీప్ సింగ్ (15 బంతులు, 2015) పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డులు రెండూ తెరమరుగయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa