భారత్-కెనడా మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఎన్నికైన తర్వాత ఇవి మరింత దారుణంగా క్షీణించాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి.. జస్టిన్ ట్రూడో భారత్పై నిరాధార ఆరోపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎన్నడూ లేని విధంగా దిగజారాయి. అయితే కెనడాలో కొత్తగా ఏర్పడిన మార్క్ కార్నీ ప్రభుత్వం.. భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిపై తాజాగా విడుదలైన ఓ డాక్యుమెంటరీ సంచలన విషయాలు ప్రసారం చేసింది. బ్రిటీష్ గూఢచార సంస్థ.. కొందరి కాల్స్ రికార్డ్ చేసి సేకరించిన సమాచారాన్ని కెనడాకు అప్పగించిందని డాక్యుమెంటరీలో చూపించారు. దీంతో హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యతో భారత్కు సంబంధాలున్నాయంటూ జస్డిన్ ట్రూడో ఆరోపణలు చేశారు.
కాగా, ‘ఇన్సైడ్ ది డెత్స్.. దట్ రాక్డ్ ఇండియాస్ రిలేషన్స్ విత్ ది వెస్ట్’ అనే పేరుతో బ్లూమ్బర్గ్ డాక్యుమెంటరీ విడుదల చేసింది. అందులో భారత ప్రభుత్వం కోసం పని చేస్తున్న కొందరు వ్యక్తులు.. ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ, నిజ్జర్ గురించి చర్చించుకుంటున్నట్లు అందులో చూపించింది. ఆ సమయంలో యూకే ప్రభుత్వ కమ్యూనికేషన్స్ హెడ్క్వార్టర్స్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. వారి కాల్స్ను ట్రాక్ చేసినట్లునట్లు చెప్పింది. అందులో వారు.. నిజ్జర్, ఖందా (అవతార్ సింగ్), పున్నన్ (గురపత్వంత్ సింగ్)ను ఎలా హత్య చేయాలనే ప్లాన్ గురించి మాట్లాడుకున్నట్లు బ్రిటిష్ నిఘా సంస్థ గుర్తించినట్లు డాక్యుమెంటరీలో ఆరోపించారు. అనంతరం నిజ్జర్ను విజయవంతంగా హత్య చేసినట్లు నిరాధార ఆరోపణలను డాక్యుమెంటరీలో ప్రాసారం చేసింది బ్లూమ్బర్గ్.
అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీలో అమెరికాకు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్ను, భారత్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను బ్లూమ్బర్గ్ ఇంటర్వూ చేసింది. అందులో అతడి చుట్టూ సాయుధ బాడీగార్డ్లతో ఉన్నాడు. అందులో తన ప్రాణానికి హాని ఉందని పన్ను పేర్కొన్నాడు. మరోవైపు, ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత.. యూకేలోని సిక్కు ఫెడరేషన్.. ఆ దేశ భద్రతా మంత్రి డాన్ జార్విస్కు లేఖ రాసింది. అందులో నిజ్జర్ హత్యపై ఎంపీలు ప్రశ్నించినప్పుడు.. ప్రభుత్వం ఈ విషయాలను తెలియజేయలేదని ప్రశ్నించింది.
యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ‘ఫైవ్ ఐస్’ అనే ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందం ఉంది. అందులో భాగంగా బ్రిటన్.. జులై 2023 చివర్లో ఈ సమాచారాన్ని కెనడాకు చేరవేసిందని.. డాక్యుమెంటరీ పేర్కొంది. దీనివల్ల నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో పురోగతి కనిపించినట్లు వీడియో డాక్యుమెంటరీలో చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa