ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందెశ్రీ మరణం బాధాకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 04:10 PM

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ అందెశ్రీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత అందెశ్రీ గారి మరణం బాధాకరం. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేయడం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. తెలంగాణ జానపదం, మాండలికంపై ఆయనకు ఉన్న పట్టు అసాధారణం. 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు' వంటి గీతాలు సమాజంపై ఆయనకున్న అవగాహనకు నిదర్శనం. 'జయ జయహే తెలంగాణ' గీతం ద్వారా ఆయన తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని పవన్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa