రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి భద్రతా విధుల్లో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయనకు సెక్యూరిటీ చూస్తున్న ఎస్ఐ రంగనాథరావు అస్వస్థతకు గురై ఆకస్మికంగా మరణించారు. ఈ విషాద ఘటన గుడివాడలో జరిగింది.వివరాల్లోకి వెళితే, మంత్రి పార్థసారథి సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఎస్ఐ రంగనాథరావు గుడివాడలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి సిబ్బంది, ఆయన్ను తక్షణమే స్థానికంగా ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ రంగనాథరావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు గతంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని గుర్తించారు. విధి నిర్వహణలో ఉన్నతాధికారి మృతి చెందడంతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa