రన్నింగ్ బస్సులో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది.. బస్సులో చూస్తే 50మంది ఉన్నారు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా.. ఆ నొప్పిని పంటి బిగువున భరిస్తూనే సమయస్ఫూర్తితో వ్యవహరించి వారందని ప్రాణాలు కాపాడో డ్రైవరన్న. గుండె నొప్పిని భరిస్తూనే బస్సు వేగాన్ని తగ్గించి.. అందర్నీ ప్రమాదం నుంచి కాపాడి.. చివరికి తాను ప్రాణాలు విడిచాడు. బస్సును అక్కడే జాతీయ రహదారిపై ఆపి ఆయన చాకచక్యంగా వ్యవహరించడంతో 50మంది సురక్షితంగా బయటపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి చెందిన నారాయణరాజు డ్రైవర్. ఆయన రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కాలేజీలో బస్సు డ్రైవర్గా విధుల్లో ఉన్నాడు. నారాయణరాజు కాలేజీ బస్సులో.. కొత్తపేట మండలం గంటి నుంచి కాలేజీకి బయల్దేరాడు. బస్సులో 50మంది వరకు విద్యార్థులు ఉన్నారు. అయితే ఆయనకు మడికి జాతీయ రహదారిపైకి రాగానే గుండెపోటు వచ్చింది. పాపం నారాయణరాజు పంటి బిగువున ఆ నొప్పిని భరించాడు.. విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని భావించాడు. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సు వేగం తగ్గించడంతో పక్కకు ఆగింది. వెంటనే నారాయణరాజు బస్సు స్టీరింగ్పై వాలిపోయాడు.
ఆ వెంటనే విద్యార్థులు వెళ్లి చూడగా.. నారాయణరాజు విగత జీవిగా పడి ఉన్నారు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. వారు కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా.. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది. అయితే నారాయణ రాజు తాను చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడారని స్థానికులు, విద్యార్థులు చర్చించుకున్నారు. గుండెపోటు వచ్చినా, తన ప్రాణాలు పోతున్నా సరే సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం జరగకుండా విద్యార్థుల్ని కాపాడాడు. చాకచక్యంగా బస్సును పక్కకు నిలిపి ప్రాణాలు కోల్పోయాడు. అందరూ నారాయణరాజును రియల్ హీరో అంటూ సంతాపాన్ని తెలిపారు. గతంలో కూడా చాలామంది డ్రైవర్లు ఇలాగే సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రయాణికుల్ని కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోనసీమ జిల్లాలో మరో ఘటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa