ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 03:45 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణ కోసం 500 మందికి పైగా భద్రతా అధికారులతో ఒక భారీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్థానిక పోలీసు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నట్లు స‌మాచారం. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ, స్పెషల్ సీపీ స్థాయి వరకు అధికారులను ఇందులో భాగం చేశారు. ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించి దర్యాప్తును వేగవంతం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa