ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 07:39 PM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత లాభాల్లోకి మారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, బిహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. మూడు రోజుల వరుస ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 12.16 పాయింట్లు లాభపడి 84,478.67 వద్ద, నిఫ్టీ 3.35 పాయింట్ల లాభంతో 25,879.15 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 88.68గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa