బీహార్లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయం ముంగిట నిలవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన, ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 'వికసిత భారత్' దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని ఆయన వివరించారు.ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. "బీహార్లో ఎన్డీయే సాధించిన ఈ అద్భుతమైన విజయం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న నిరంతర విశ్వాసానికి నిదర్శనం. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వికసిత భారత్' దార్శనికతకు ఇది ప్రతిబింబం" అని ఆయన పేర్కొన్నారు.తన ప్రియ మిత్రుడు నితీశ్ కుమార్కు, బీజేపీ, జేడీయూ విజేతలకు ఈ చారిత్రక విజయంపై శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈ పోస్టుకు #NaNiLandslideInBihar అనే హ్యాష్ట్యాగ్ను జతచేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa