ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో త్వరలోనే డ్రోన్ ట్యాక్సీలను తీసుకువస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 03:47 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికి పెట్టుబడుల ముఖద్వారంగా (గేట్‌వే) తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ దార్శనికతను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించారు. త్వరలోనే ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని, విశాఖలో 'ఆంధ్రా మండపం' నిర్మిస్తామని కీలక ప్రకటనలు చేశారు. ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులతో పాటు మొత్తం 2,500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం అత్యంత సుందరమైన, సురక్షితమైన నగరమని, ఇక్కడి ప్రకృతి వనరులు, బీచ్‌లు, కొండలు ఎంతో ప్రత్యేకమైనవని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa