ఎర్రచందనం పరిరక్షణకు, అక్రమ రవాణా నిరోధానికి ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా బయటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన, ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతాన్ని తిరిగి వనాల అభివృద్ధి, సంరక్షణకే కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పవన్ సూచించారు. స్మగ్లింగ్ జరిగే మార్గాల్లో థర్మల్ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టులను పటిష్టం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన వందలాది టన్నుల ఎర్రచందనాన్ని వెనక్కి తెచ్చే ప్రక్రియ వేగవంతం చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa