కోల్ కతలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పరాజయాన్ని ఎదుర్కొంది. రెండో ఇన్నింగ్లో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది.93 పరుగులకే జట్టు చాప చుట్టి, 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. గెలవడానికి టీమిండియా పెద్ద స్కోరు అవసరం లేదు, కేవలం 123 పరుగులు సాధించాలి మాత్రమే. అయినా కూడా దక్షిణాఫ్రికా బౌలర్ల మాకు అడ్డుకట్ట వేసింది.ప్రారంభం నుండే జట్టు ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం నాలుగు బంతులలో జెన్ సెన్ బౌలింగ్లో వికెట్ కీపర్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అదే విధంగా జెన్ సెన్ చేతిలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.తరువాత వచ్చిన జురెల్ గానీ, రిషభ్ పంత్ గానీ క్రీజ్లో నిలబడలేకపోయారు. జురెల్ 13, రిషభ్ పంత్ 2 పరుగులు మాత్రమే చేయగలిగారు. వీరిద్దరి వికెట్లను సైమన్ హార్మర్ కుప్పకూల్చాడు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కొంత ప్రతిఘటన చూపినా, జట్టును విజయానికి చేర్చలేకపోయారు. టాప్ స్కోరర్ వాషింగ్టన్ సుందర్ 31 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 26, రవీంద్ర జడేజా 18 పరుగులు చేశారు.కుల్ దీప్ యాదవ్ 1 పరుగే చేసింది. జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఖాతాలను తెరవలేక డకౌట్ అయ్యారు. మెడనొప్పితో బాధపడుతున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్కు దిగలేదు. సైమన్ హార్మర్ ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్లో నాలుగు వికెట్లు తీసి, మొత్తం ఈ టెస్ట్లో ఎనిమిది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని స్పిన్కు భారత బ్యాటర్లు సమాధానం చూపలేకపోయారు.మార్కో జెన్ సెన్, కేశవ్ మహరాజ్ రెండు రెండు వికెట్లు తీసి, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ వికెట్లను పడగొట్టారు. ఈ విజయంతో ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0 తేడాతో ఆధిక్యత సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన గువాహటిలో ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa