వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. మరోవైపు, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అరెస్ట్పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై ఆయన మండిపడ్డారు. వెంకటరెడ్డిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. "ఆయనను తాడిపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. కానీ అరెస్ట్కు గల కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం దారుణం. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగింది" అని అంబటి విమర్శించారు.వెంకటరెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో ప్రభుత్వం పరిశీలించాలి కానీ, ఇలా అరెస్ట్ చేయడం భయంకరమైన ధోరణి అని అంబటి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa