ఛత్తీస్గఢ్లో నవంబర్ 10న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా (మాద్వీ మరణించిన కొద్ది రోజులకే అతను రాసినట్లు చెప్పబడుతున్న ఒక లేఖ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ లేఖను హిడ్మా స్వయంగా ఓ స్థానిక జర్నలిస్టుకు పంపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఎన్కౌంటర్కు రెండు రోజుల ముందే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
లేఖలో “జోహార్.. మా మొత్తం పార్టీ లొంగిపోవడానికి ఇంకా సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్క్తో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు, మా కుటుంబాలకు పూర్తి భద్రతా హామీ ఇస్తే ఎవరితోనైనా మాట్లాడేందుకు, లొంగిపోవడం గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టంగా పేర్కొన్నాడు హిడ్మా. అయితే ఆ స్థానాన్ని ప్రభుత్వమే నిర్ణయించాలని షరతు విధించాడు.
బడింది.
ఈ లేఖ నిజమైనదేనా, లేక ఎన్కౌంటర్ తర్వాత ఎవరో సృష్టించినదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మావోయిస్టు వర్గాల్లో కొందరు దీన్ని “హిడ్మా చివరి గడ్డు సందేశం”గా ప్రచారం చేస్తుంటే, సెక్యూరిటీ అధికారులు మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు.
గత కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు లొంగిపోతే భారీ రిహాబిలిటేషన్ ప్యాకేజీ, భద్రత ఇస్తామని ప్రభుత్వం ప్రకడ్బందీగా ప్రకటిస్తోంది. అయినప్పటికీ హిడ్మా వంటి టాప్ నేతలు లొంగిపోవడానికి ఇంతవరకు ఆసక్తి చూపలేదు. ఈ లేఖ ద్వారా చివరి నిమిషంలో ఏదో ఒక ఒప్పందం కుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది – కానీ ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఎన్కౌంటర్లో జీవితం ముగిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa