ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎం లాజిస్టిక్స్ వాహనంలో జరిగిన నగదు చోరీలో వెలుగులోకి కీలక విషయాలు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 01:21 PM

బెంగళూరులో పట్టపగలు జరిగిన ఓ భారీ దోపిడీ కేసులో ఊహించని కోణం వెలుగులోకి వచ్చింది. ఏటీఎం లాజిస్టిక్స్ వాహనం నుంచి రూ. 7.11 కోట్లు అపహరించిన దొంగలు, తాము ఉపయోగించిన కారుకు అమాయకుడైన ఓ 78 ఏళ్ల వృద్ధుడి కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను వాడారు. పోలీసులు తన ఇంటి తలుపు తట్టే వరకు ఈ విషయం తెలియని ఆ వృద్ధుడు షాక్‌కు గురయ్యారు.బుధవారం బెంగళూరులో ఐటీ, ఆర్‌బీఐ అధికారులమని నమ్మించి కొందరు దుండగులు ఏటీఎంకు డబ్బు తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించి రూ. 7.11 కోట్లు దోచుకెళ్లారు. ఈ దోపిడీ కోసం వారు KA 03 NC 8052 నంబర్ గల ఇన్నోవా కారును ఉపయోగించారు. పోలీసులు ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా, అది గంగాధర్ అనే 78 ఏళ్ల వృద్ధుడి స్విఫ్ట్ కారుకు చెందినదని తేలింది.దుబాయ్‌లో పనిచేసి ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్న గంగాధర్ ఇంటికి పోలీసులు వెళ్లారు. అప్పుడు ఆయన నిద్రపోతున్నారు. పోలీసులు వచ్చి తన కారు గురించి అడిగినప్పుడు ఆయనకు ఏమీ అర్థం కాలేదు. దోపిడీ గురించి పోలీసులు ఆయనకు చెప్పలేదు. అయితే, కొద్దిసేపటికే న్యూస్ ఛానళ్లలో తన కారు నంబర్ ఫ్లాష్ అవ్వడం చూసి ఆయన నివ్వెరపోయారు."పోలీసులు వచ్చినప్పుడు నా కారు ఇంట్లోనే పార్క్ చేసి ఉంది. అసలు బెంగళూరులో లక్షలాది వాహనాలు ఉండగా, నా కారు నంబర్‌నే ఆ దొంగలు ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదు. ఇదే మొదటిసారి పోలీసులు నా ఇంటికి రావడం. అయితే వారు నాతో చాలా మర్యాదగా మాట్లాడారు" అని గంగాధర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa