స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వాడకం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్న దేశాల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించగా, ఇప్పుడు అదే బాటలో పయనించేందుకు మలేషియా సిద్ధమవుతోంది. సామాజిక మాధ్యమాల వినియోగంపై పరిమితులు విధించే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మలేషియా కమ్యూనికేషన్ల మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ తెలిపారు.వచ్చే ఏడాది నాటికి 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధించే ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తున్నామని, పిల్లల భవిష్యత్తును కాపాడటంలో ప్రభుత్వం, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని ఫాహ్మి ఫడ్జిల్ అన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో మలేషియా ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణను కఠినతరం చేసింది. సెప్టెంబర్లో వెలువడిన ఇప్సోస్ మలేషియా సర్వేలో 72 శాతం మంది ప్రజలు పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయడాన్ని సమర్థించడం గమనార్హం.మరోవైపు, ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa