ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పర్యటనలపై కావాలనే టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 05:28 PM

వైయస్.జగన్ హైదరాబాద్ పర్యటనలో సునామీలా తరలివచ్చిన జనాలను చూసి జీర్ణించుకోలేని  టీడీపీ, అనుకూల మీడియా జుగుప్సాకరమైన దుష్ప్రచారం చేస్తుందంటూ  వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మీడియా పాలన సాగుతోందని... మీడియా రాజ్యాధికారాన్ని కంట్రోల్ చేస్తూ, వ్యవస్థల నియంత్రణ చేస్తుందని మండిపడ్డారు. తమసోమా జ్యోతిర్గమయి అంటూనే,  ఏబీయన్ రాధాకృష్ణ పిచ్చిరాతలు రాస్తున్నారని... ఆయనకు అసలు ఆ శ్లోకానికి అర్ధం తెలుసా అని నిలదీశారు. వైయస్.జగన్ పర్యటనలో ఆంధ్ర నుంచి జనాన్ని తరలించారంటూ పిచ్చి కూతలు కూసిన ఆర్కే..  దమ్ముంటే ఆధారాలతో వాస్తవాలు భయట పెట్టాలని సవాల్ విసిరారు. మరోవైపు న్యాయమూర్తి అనుమతి లేకుండా కోర్టుహాల్ వీడియో లీక్ చేసి.. వైయస్.జగన్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ముమ్మూటికీ కోర్టు ధిక్కారమేనని తేల్చి చెప్పారు. ఇకనైనా వైయస్.జగన్ మీద కడుపు మంటతో.. పిచ్చి రాతలు మానుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa