ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 05:38 PM

వైద్య కళాశాలల ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి తెలిపారు.  మెడిక‌ల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ కూట‌మి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ బన‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం కొలిమిగుండ్ల మండ‌లం బెలుం గ్రామంలో చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో రామిరెడ్డి పాల్గొని ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నియోజ‌వ‌క‌ర్గంలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని తెలిపారు. 18 నెలలు కావస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 17 ప్రభుత్వ వైద్యకళాశాలలను నిర్మించి, ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆస్తిని ఏర్పాటు చేశారని కొనియాడారు. అలాంటి ప్రభుత్వ కళాశాలల్లో అర్హత ఉన్న వారికి సీట్లు లేకుండా పేద వారిని వైద్య విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగిస్తోందని ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa