అమరావతి రైతులు తమ భూములను 2015లో రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చామని, దశాబ్దం గడిచినా అనుకున్నది జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తించి, పార్లమెంట్ లో విభజన చట్టానికి సవరణ తెచ్చి, రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయితేనే అమరావతికి రాజముద్ర పడుతుందని రైతులు అంటున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ మద్దతు అవసరం ఉన్నా, తెలంగాణ నుంచి వచ్చే అభ్యంతరాలు, కొత్త ప్రతిపాదనలు సవరణ ప్రక్రియకు ఇబ్బంది కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa