కులాలుమతాలకు అతీతంగా పౌరులందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అయన మాట్లాడుతూ... రాజ్యాంగానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై పగ సాధిస్తున్నారు. వ్యక్తి స్వేచ్ఛను, పౌర హక్కులను యథేచ్ఛగా కాలరాస్తున్నారు. గడిచిన ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో అన్నివర్గాలకు న్యాయం జరిగితే, కూటమి పాలన వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ముళ్ల పొదల మధ్య పెట్టాలని చూసి అవమానించారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని సగర్వంగా నిలబెట్టారు. అంబేడ్కర్ వాదులంతా వైయస్ జగన్కి రుణపడి ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ స్మృతి వనం నిర్వహణ గాలికొదిలేశారు. అంబేడ్కర్ భావజాలం ప్రజల్లో మెదళ్లలోకి వెళితే చంద్రబాబు ఆగడాలు సాగవనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపిస్తున్నాడు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa