తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోలు వ్యవహారంపై జరుగుతున్న వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, సిట్ దర్యాప్తును కేవలం 2019-24 మధ్య కాలానికే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకుముందు జరిగిన కొనుగోళ్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.తాను టీటీడీ ఛైర్మన్గా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్ఠను పెంచేందుకే పనిచేశానని, దేవుడి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని సుబ్బారెడ్డి అన్నారు. తనపై విషప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసినప్పుడు తాను సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను తప్పు చేసి ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు.సిట్ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేశారని మీడియాలో కథనాలు రావడం దురదృష్టకరమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa