ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమిపూజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 07:32 PM

దేవతల రాజధాని నమూనాతో ఏపీ రాజధాని అమరావతి నిర్మితమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఈ పవిత్ర కార్యక్రమానికి సహకరించిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. గురువారం అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనుల్లో భాగంగా ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణం, మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa