ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా రైలు దుర్మరణం: 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 11:18 PM

చైనాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలపై పనులు చేస్తున్న రైల్వే కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘోర రైలు ప్రమాదం యున్నాన్ ప్రావిన్స్‌లో జరిగింది. భూకంప పరికరాల పరీక్ష కోసం ఉపయోగించే టెస్టింగ్‌ ట్రైన్ కున్మింగ్‌లోని లుయోయాంగ్ టౌన్ స్టేషన్‌లో ప్రయాణిస్తోంది. వంపుగా ఉన్న రైల్వే ట్రాక్ వద్ద కొందరు కార్మికులు పని చేస్తుండగా, ట్రైన్ పట్టాలపై నుంచి తప్పి కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ఘటనపై అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు.గత పదేళ్లలో చైనాలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇది అత్యంత తీవ్రమైనది. 2011లో జరిగిన దుర్ఘటనలో 40 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.చైనా రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది 1,60,000 కిలోమీటర్ల (1,00,000 మైళ్లకు పైగా) విస్తీర్ణంలో ఉంది. 2021లో వాయువ్య ప్రావిన్స్‌లోని రైల్వే కార్మికులపై మరో ట్రైన్ దూసుకెళ్లడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa