సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీపార్టీ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలుఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ సమస్యలు, ఆలోచనలు ఏవైనా ఉంటే మాకు చెప్పండి.. మేము పార్లమెంటులో వినిపిస్తామంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపు నిచ్చారు. కామెంట్ సెక్షన్లో మీ సమస్యలు, ఆలోచనలు చెప్తే.. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామంటూ లావు శ్రీకృష్ణ దేవరాయలుట్వీట్ చేశారు. దీనికి మంచి స్పందన కూడా లభిస్తోంది.
"ప్రియమైన యువ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ యువతా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నేను, నా తోటి టీడీపీ ఎంపీలతో కలిసి, మన రాష్ట్రం, మీ భవిష్యత్తు కోసం మార్పు తీసుకురావడానికి పార్లమెంటులో లేవనెత్తాల్సిన సమస్యలు ఏమిటి? అనేది నేను మీ నుంచి వినాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ సభ్యులుగామేము భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. అలాగే మీరు కూడా దానిలో భాగం కావాలని కోరుకుంటున్నాం. కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను తెలియజేయండి! జాతీయ వేదికపై ముఖ్యమైన అంశాలపై దృష్టిని ఆకర్షించడానికి కలిసి పని చేద్దాం." అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.
మరోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్కు నెటిజనం నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. కొంతమంది నెటిజనం రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిని తగ్గించాలని కోరితే.. మరికొంతమంది తమ స్థానిక సమస్యలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని మరికొందరు సూచించారు. జాతీయ రహదారి 167ఏ నిర్మాణం కోసం భూములు సేకరించిన రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా చూడాలని మరో నెటిజన్ కోరారు.
మరో నెటిజన్.. రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసే బదులుగా రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. రైలు ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని.. దయచేసి రైళ్ల సంఖ్యను పెంచండి అన్నా అని కామెంట్ చేశారు. రైలు ఆగని స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారని.. ఆ స్టేషన్లలోరైళ్లను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు.
మరో నెటిజన్ రైతులకు లక్ష వరకూ వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా చూడాలని.. అలా కుదరని పక్షంలో రెండేళ్ల పాటు వడ్డీమాఫీ చేయాలని కోరారు. మరో వ్యక్తి దక్షిణ భారతదేశ విద్యార్థులు మూడు లాంగ్వేజీల చదవలేక ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించి లాంగ్వేజి సబ్జెక్టులను రెండుకు కుదించేలా చూడాలని అన్నారు. అలాగే రైల్వే రూట్ కనెక్షన్ల మీద, రైళ్ల స్టాపింగ్ మీద, ఆర్వోబీల నిర్మాణంపైనా పలువురు తమ సమస్యలను ఎక్స్ వేదికగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa