ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌కు ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 07:31 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌కు ఊరట లభించింది. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందుకున్న ప్రకాశ్అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కలిసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు తన కృతజ్ఞతలు తెలిపారు.గత జగన్ ప్రభుత్వ హయాంలో పోలీసు సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశ్ ధర్నా చేశారు. దీనిని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన అప్పటి ఉన్నతాధికారులు ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో, చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకాశ్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రకాశ్‌కు న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa