ట్రెండింగ్
Epaper    English    தமிழ்

CBSE విద్యార్థులకు అలర్ట్: సిలబస్, పరీక్షల్లో మార్పులు!

national |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 04:03 PM

సీబీఎస్ఈ రాబోయే విద్యా సంవత్సరంలో సిలబస్‌, పరీక్షలు, మార్కుల విధానంలో మార్పులు చేస్తోంది. 10వ తరగతిలో స్కిల్‌-బేస్డ్ సబ్జెక్టులు తప్పనిసరి. ప్రధాన విషయాల్లో ఫెయిల్ అయితే స్కిల్ మార్కులు జోడిస్తారు. 2026 నుంచి 10వ బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు ఉంటాయి. 11, 12 తరగతుల లీగల్‌ స్టడీస్‌ సిలబస్‌లో కొత్త అంశాలు చేరతాయి. ప్రశ్నపత్రాల్లో కాంపిటెన్సీ, ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మార్కులు 60% బోర్డు, 40% ఇంటర్నల్స్ ఆధారంగా ఇస్తారు. 9-పాయింట్ల గ్రేడింగ్ అమలులోకి వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa