ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలకు రికార్డు స్థాయిలో భక్తులు.. 25 లక్షలు దాటిన సంఖ్య

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 01:57 PM

కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో మండల-మకరవిళక్కు వేడుకల సందర్భంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 21 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ చివరినాటికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, భక్తుల దర్శనాలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశామని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఎడీజీపీ ఎస్ శ్రీజిత్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa