ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుదైన మైలురాయిని అధికమించిన ఎలాన్ మస్క్

international |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 02:54 PM

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్ల నికర సంపదను సాధించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం నాటికి ఆయన ఈ అరుదైన మైలురాయిని అధిగమించారు. ముఖ్యంగా ఆయనకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ 'స్పేస్‌ఎక్స్' త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుందన్న వార్తలే ఈ భారీ పెరుగుదలకు కారణంగా నిలిచాయి.స్పేస్‌ఎక్స్‌ను సుమారు 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు దాదాపు 42 శాతం వాటా ఉంది. ఈ వాల్యుయేషన్ ప్రకారం ఒక్క స్పేస్‌ఎక్స్ నుంచే ఆయన సంపదకు 168 బిలియన్ డాలర్లు అదనంగా చేరతాయి. దీంతో సోమవారం నాటికి ఆయన మొత్తం సంపద 677 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. గత అక్టోబర్‌లోనే మస్క్ 500 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే.మస్క్ సంపద పెరగడానికి టెస్లా, ఎక్స్‌ఏఐ కంపెనీలు కూడా దోహదం చేస్తున్నాయి. టెస్లాలో ఆయనకు 12 శాతం వాటా ఉండగా, ఈ ఏడాది ఆ కంపెనీ షేర్లు 13 శాతం పెరిగాయి. డ్రైవర్ సీటులో సేఫ్టీ మానిటర్ లేకుండా రోబోట్యాక్సీలను పరీక్షిస్తున్నామని మస్క్ ప్రకటించడంతో సోమవారం టెస్లా స్టాక్ దాదాపు 4 శాతం లాభపడింది. మరోవైపు మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'ఎక్స్‌ఏఐ' కూడా 230 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో 15 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు చర్చలు జరుపుతోంది. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు మస్క్, టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ఏఐ సంస్థలు వెంటనే స్పందించలేదని రాయిటర్స్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa