ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా పాత వాహనాల విషయంలో కఠిన చర్యలు తప్పవంటున్న ఢిల్లీ ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 03:05 PM

దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి మినహాయింపులకు తావివ్వడం లేదు. ఢిల్లీ బార్డర్ తో పాటు సిటీలోనూ వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బీఎస్ 4 ఆపై ప్రమాణాలు ఉన్న వాహనాలకు తప్ప మిగతా వాహనాలను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. పాత వాహనాలతో వచ్చే వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. బీఎస్ 3 కార్లలో వచ్చే వారికి రూ.20 వేలు ఫైన్ వేస్తామని హెచ్చరిస్తున్నారు.జరిమానా తప్పించుకోవాలంటే బార్డర్ నుంచే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. ఢిల్లీలోని పాత వాహనాల యజమానులకూ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాలుష్య నియంత్రణకు సహకరించకుండా పాత వాహనాలతో రోడ్డెక్కితే 20 వేలు ఫైన్ కట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నగరం నలుమూలలా చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు జరుపుతున్నామని, తప్పించుకునే అవకాశమే లేదని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa