మూడు సీజన్లులగా క్రికెట్ ప్రేమికులను అలరించిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని నారా లోకేశ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బ్రహ్మణి... అనంతరం మైదానంలోకి దిగి టోర్నీ ప్రారంభించారు. బ్యాట్ చేతపట్టి షాట్లు కొట్టారు. ఓపెనింగ్ మ్యాచ్ ను కొద్దిసేపు వీక్షించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్థార్థ్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను బ్రహ్మణి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa