ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ పింఛను పథకం కొత్త రూల్స్.. నిబంధనల్లో కీలక మార్పులు

business |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 10:47 PM

జాతీయ పింఛన్‌ వ్యవస్థ (ఎన్‌పీ‌ఎస్) నిబంధనల్లో కీలక మార్పులు వచ్చాయి. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఈ సవరణలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. యాన్యుటీ లిమిట్ 20 శాతానికి కుదించడం సహా 85 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎన్‌పీఎస్‌ స్కీమ్‌లో కొనసాగేందుకు అనుమతించారు. కనీసం ఆరేళ్ల పాటు సిస్టమిక్‌ యూనిట్‌ రిడంప్షన్‌ను అనుమతించారు. ఎన్‌పీఎస్‌లో వంచిన ప్రధాన మార్పులు తెలుసుకుందాం.


ఎన్‌పీఎస్‌ చందాదారులు ఇప్పటి వరకు 75 ఏళ్ల గరిష్ఠ వయసు వరకే కొనసాగేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఈ వయో పరిమితిని 85 ఏళ్లకు పెంచారు. ఈ వయసు తర్వాత తమ అకౌంట్లోని మొత్తాన్ని ఒకేసారి లేదా దశల వారీగా విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకూ వర్తిస్తుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక స్థిరత్వం ఉన్న ఎన్‌పీఎస్ చందాదారులకు లబ్ధిచేకూర్చుతుంది.


గతంలో ప్రభుత్వేతర ఉద్యోగులు రిటైర్మెంట్‌ తర్వాత లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో తమ అకౌంట్లలో జమైన రూ.5 లక్షలకు మించి ఉంటే.. అందులో 40 శాతం యాన్యుటీల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు దానిని 20 శాతానికి తగ్గించారు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రత్యేక సందర్భాల్లో 100 శాతం మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్‌ నాటికి ఎన్‌పీఎస్ అకౌంట్లో పోగైన రూ.8 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే మొత్తంలో కనీసం 40 శాతంతో, ప్రైవేట్‌ ఉద్యోగులైతే 20 శాతం కనీస మొత్తంతో యాన్యుటీ కొనాల్సి ఉంటుంది.


ఎన్‌పీఎస్ చందాదారులు రిటైరయ్యేలోపు అంటే లేదా సూపర్‌యాన్యుయేషన్‌ లోపు 4 విడతల వరకు తమ ఎన్‌పీఎస్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేయవచ్చు. అయితే ఇందు కోసం ఒక విత్ ‌డ్రాయల్‌కు మరో విత్ ‌డ్రాయల్‌కు మధ్య కనీసం నాలుగు సంవత్సరాల వ్యవధి ఉండాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది మూడు సంవత్సరాలుగా ఉండేది. పదవీ విరమణ లేదా 60 ఏళ్ల తర్వాత కొంత మంది పింఛను పథకంలో కొనసాగుతారు. వీరు కూడా మూడేళ్లేకోసారి తమ చందా మొత్తం నుంచి 25 శాతం విత్ డ్రా చేయవచ్చు.


ఎన్‌పీఎస్ చందాదారులు భారత పౌరసత్వం వదులుకుంటే ఆ వ్యక్తి తన ఖాతా క్లోజ్‌ చేసుకోవచ్చు. అప్పటి వరకు అకౌంట్లో జమైన మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. కనిపించకుండా పోయిన లేదా చనిపోయారని భావించే వ్యక్తుల విషయంలో వ్యక్తుల నామినీలు లేదా చట్టబద్ద వారసులకు 20 శాతాన్ని ఒకేసారి చెల్లిస్తారు. ప్రతి ఎన్‌పీఎస్ ఖాతాకు శాశ్వత రిటైర్మెంట్‌ ఖాతా (పీఆర్‌ఏ) పేరుతో ప్రత్యేక నంబరు కేటాయిస్తారు.


ఎన్‌పీఎస్ అకౌంట్లో రిటైరయ్యే నాటికి రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు జమ అయితే విత్ ‌డ్రాయల్స్‌ కోసం కొత్త శ్లాబులు తీసుకొచ్చారు. మొదటి ఆప్షన్ ప్రకారం ఒకేసారి రూ.6 లక్షల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆప్షన్‌ 2 ప్రకారం ఒకేసారి రూ.6 లక్షల వరకు వెనక్కి తీసుకుని మిగతా మొత్తంతో యాన్యుటీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆప్షన్‌ 3 ప్రకారం రిటైర్మెంట్‌ ఖాతాలో 60 శాతం ఒకేసారి పన్నులు లేకుండా వెనక్కి తీసుకోవచ్చు.


ప్రైవేట్ ఉద్యోగులు మొదటి రెండు ఎగ్జిట్‌ ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు. మూడో ఆప్షన్‌ ఎంచుకంటే 20 శాతం కార్ప్‌సతో యాన్యుటీలు కొనుగోలు చేయాలి. మిగిలిన 80 శాతాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. ఎన్‌పీఎస్ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్తగా సిస్టమిక్‌ యూనిట్‌ రిడంప్షన్‌ ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌ అమలు చేస్తున్న సిస్టమిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్స్‌ లాంటిది. ఈ ఆప్షన్‌ రిటైరయ్యే నాటికి రూ.8 లక్షల పైన, రూ.12 లక్షల లోపు ఉంటే ఎన్‌పీఎస్ చందాదారులకు వర్తిస్తుంది. ఇలాంటి ఉద్యోగులకు ఒకేసారి రూ.6 లక్షల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని ఎస్‌యూఆర్‌ ఖాతాకి మళ్లించి ఆరేళ్ల తర్వాత తీసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa