ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుదారులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 03:03 PM

కొత్త సంవత్సరం ప్రారంభ నెల, సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, జొన్నలతో పాటు గోధుమ పిండి(హోల్ వీట్ ఆటా) పంపిణీ చేసేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో హోల్ వీట్ ఆటా కిలో ధర రూ.40కి పైగా ఉంది. దీనిని సగం ధర రూ.20కే కిలో చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించి స్టాక్ కేటాయింపులు జరిగాయి. గుంటూరు జిల్లాలో గోధుమపిండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 2,68,709 కేజీల ప్యాకెట్లను సివిల్ సప్లైస్ గోదాములలో నిల్వ ఉంచుతోంది. అలాగే.. బాపట్ల జిల్లాకు 58,718 కేజీ ప్యాకెట్లు, పల్నాడు జిల్లాకు 1,19,677 ప్యాకెట్లను కేటాయించింది. గోధుమ పిండికి డీలర్ల నుంచి ముందుగానే నగదు చెల్లించుకుని సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి గోధుమపిండి ప్యాకెట్లను నెలాఖరులోగా రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి డీలర్లు రేషన్ సరుకుల్లో గోధుమ పిండి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa