ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి యజమానులని చిత్రహింసలకి గురిచేసిన కేర్ టేకర్లు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 12:36 PM

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా రిటైరై హుందాగా బతికిన ఒక వృద్ధుడిని, ఆయన మానసిక వికలాంగురాలైన కుమార్తెను కేర్ టేకర్లు బందీలుగా మార్చి నరకం చూపించారు. ఐదేళ్ల పాటు సాగిన ఈ చిత్రహింసల కారణంగా ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా, ఆయన కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ఓంప్రకాష్ సింగ్ రాథోడ్ (70) రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. 2016లో భార్య మరణించాక, తన 27 ఏళ్ల దివ్యాంగురాలైన కుమార్తె రష్మితో కలిసి ఉంటున్నారు. వారిని చూసుకోవడానికి రామ్ ప్రకాష్ కుష్వాహా, ఆయన భార్య రమాదేవిని కేర్ టేకర్లుగా కుటుంబ సభ్యులు నియమించారు. అయితే ఈ దంపతులు వారిద్దరినీ ఇంటి కింది గదిలో బంధించి, తాము మేడ మీద విలాసంగా గడపడం మొదలుపెట్టారు. బంధువులు ఎవరైనా చూడటానికి వస్తే.. "ఓంప్రకాష్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదు" అని చెప్పి వెనక్కి పంపించేవారు.సోమవారం ఓంప్రకాష్ మరణించాడన్న వార్త తెలిసి బంధువులు ఇంటికి వెళ్లి, అక్కడి దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. ఎప్పుడూ సూటు, టై వేసుకుని హుందాగా కనిపించే ఓంప్రకాష్ శరీరం ఎముకల గూడులా మారిపోయి ఉంది. ఇక చీకటి గదిలో వివస్త్రగా పడి ఉన్న ఆయన కుమార్తె రష్మి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. 27 ఏళ్ల ఆ యువతి ఆకలి కారణంగా 80 ఏళ్ల వృద్ధురాలిలా అస్థిపంజరంలా మారిందని బంధువు పుష్పా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఓంప్రకాష్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. ప్రస్తుతం రష్మి బాధ్యతను బంధువులు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa