ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో బస్సు ప్రమాదం, నలుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 12:38 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగర ప్రజా రవాణా వ్యవస్థ అయిన 'బెస్ట్' బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. భాండూప్ ప్రాంతంలోని స్టేషన్ రోడ్డు సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన.పోలీసుల కథనం ప్రకారం.. బస్సు తన రూట్ ముగించుకుని చివరి పాయింట్ వద్ద రివర్స్ తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెనుక ఉన్న పాదచారులను బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో సంతోష్ రమేశ్ సావంత్ (52) డ్రైవర్‌గా, భగవాన్ భౌ ఘారే (47) కండక్టర్‌గా విధుల్లో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa