రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 'ప్రజల సేవలో ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా నేడు, రేపు ప్రతి నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొత్తగా నియమితులైన పార్లమెంటరీ స్థాయి అధ్యక్షులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో వారు మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంలో ఎన్నికల హామీలన్నింటినీ వేగంగా అమలు చేశామని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేసిన కీలక పథకాల వివరాలను ఆయన తెలియజేశారు. 'తల్లికి వందనం' ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు, 'అన్నదాత సుఖీభవ' కింద 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు.అదేవిధంగా 'స్త్రీ శక్తి' పథకంతో మహిళలకు, అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు. 'దీపం' పథకం కింద అర్హులైన వారికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద రూ.50,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి కూడా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa