భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పుడు దగ్గర్లోనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కింగ్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు కేవలం 25 పరుగులే మిగిలి ఉన్నాయి. ఈ ఘనతను అతడు న్యూజిలాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.టీ20, టెస్ట్ ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్పైనే పూర్తి దృష్టి పెట్టాడు. జనవరి 11న న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డే మ్యాచ్లో కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగనుండటం విశేషం. ఈ మ్యాచ్లోనే చరిత్ర తిరగరాయబడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం కోహ్లీ 623 అంతర్జాతీయ ఇన్నింగ్స్ల్లో 27,975 పరుగులు సాధించాడు. మరో 25 పరుగులు చేస్తే, 28,000 పరుగుల క్లబ్లోకి అడుగుపెట్టే మూడో బ్యాట్స్మన్గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే ఉన్నారు. అంతేకాదు, సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధిస్తే, కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్టే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa